ప్రెసిడెంట్ బైడెన్ తోలు బొమ్మ : మాస్క్ సంచ‌ల‌నం వ్యాఖ్య‌లు

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జో బైడెన్ మానవ రూపంలో ఉన్న‌ తోలు బోమ్మ అని మండి ప‌డ్డారు. అయితే అమెరికాను తిరిగి ఆర్థిక శ‌క్తిగా మార్చేందుకు ఇటీవ‌ల అధ్య‌క్షుడు జో బైడెన్ ప‌లు ప్ర‌యివేటు కంపెనీల సీఈవో లతో స‌మావేశం ఏర్పాటు చేశారు. దేశంలో పెట్టుబ‌డులు వంటి అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌స్తుతం చాలా కంపెనీలు విద్యుత్ వాహ‌నాల‌ను తయారు చేస్తున్నాయ‌ని జో బైడెన్ అన్నారు.

రానున్న కాలంలో విద్యుత్ వాహానాల‌దే హావా ఉంటుంద‌ని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి చాలా మంది ముందుకు వ‌స్తున్నార‌ని ప‌లు కంపెనీలు గురించి ఆ కంపెనీల సీఈవోల గురించి జో బైడెన్ మాట్లాడారు. కాగ ఈ స‌మావేశానికి ఎలాన్ మాస్క్ ను ఆహ్వానించ‌క పోవ‌డం.. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టెస్లా కంపెనీ పేరును ప్ర‌స్తావించ‌క పోవ‌డం పై ఎలాన్ మాస్క్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ అమెరికా ప్ర‌జ‌ల‌ను ఫుల్స్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న ఒక తోలు బోమ్మ అని ఆగ్ర‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news