12న తెలంగాణకు ప్రధాని మోడీ..బీజేపీ కీలక ప్రకటన

-

12న తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చే నిమిత్తం నవంబర్ 12న వస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రామగుండం పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు, తన కొత్త మిత్రులు సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

ఎరువుల ఫ్యాక్టరీ తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుంది. ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ మరోసారి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా విజ్ఞత గల తెలంగాణ ప్రజలు నమ్మబోరు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం ఆయన గుర్తించాలి. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదు. శ్రీ నరేంద్ర మోదీ గారు చొరవ తీసుకుని రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ అంటున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి, రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కి.మీ.లు. ఇప్పుడు 4,996 కి.మీ.లకు పెరిగింది. 2014-2022 కాలంలో కొత్తగా 2,485 కి.మీ.లు జాతీయ రహదారులు నిర్మించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైంది. ఇంకా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ అంబర్‌పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news