ఉపరాష్ట్రపతి వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోది

-

ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ట్విటర్ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపారు.” గౌరవనీయులైన శ్రీ వెంకయ్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు.

మన దేశ ప్రజలకు ఆయన ఒక స్ఫూర్తి. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న అభిరుచి చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా ఆయనకు దగ్గరగా పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆయనలో ఉన్న ఎనర్జీని చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. ఉపరాష్ట్రపతిగా( రాజ్యసభ చైర్మన్) పార్లమెంటు ప్రొసీడింగ్స్, చర్చల స్థాయులను ఆయన పెంచేశారు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నా” అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news