“భీమ్లా నాయ‌క్” పై పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్య‌లు.. అది చాలా బాధాకరం !

-

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి రానా కాంబినేషన్ లో వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ సినిమా ఈ నెల 25 న విడుద‌ల అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతుంది. గ‌త కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ మానియా న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా.. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫెక్లీలు, భీమ్లా నాయక్ పోస్ట‌ర్లే క‌నిపిస్తున్నాయి.

భీమ్లా నాయ‌క్ సినిమా చేస్తున్న అరాచ‌కం పై ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని.. చిత్ర బృందాన్ని మెచ్చుకుంటున్నారు. తాజా గా టాలీవుడ్ హాస్య నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్… భీమ్లా నాయక్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉందని పేర్కొన్నారు.

బిమ్లా నాయక్ సినిమా క్లైమాక్స్ తో పాటు రానా-పవన్ కళ్యాణ్ నటించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి అని వెల్లడించారు. తాను కూడా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాం అని పేర్కొన్నారు. అయితే ఇంత అద్భుతమైన సినిమాలో తాను నటించక పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పృథ్వి రాజ్. పవన్ కళ్యాణ్ కి దిష్టి తగలకుండా దాని కోరుకుంటున్నానని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version