జగన్‌, కేసీఆర్‌ లపై నిర్మాత దిల్‌ రాజ్‌ సంచలన ట్వీట్‌ !

-

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్‌, జగన్‌ మోహన్‌ రెడ్డిలకు టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు దిల్‌ రాజు.

“పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అదనంగా 5వ షోను ప్రదర్శించేందుకు వెసులుబాటు కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు. సినిమాల పునరుద్ధరణను వేగవంతం చేయడానికి ఇది ఒక ప్రధాన అడుగు. మాకు సహాయం చేసినందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,
తెలంగాణ సీఎంఓ సోమేష్‌ కుమార్‌ కు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధరల సమస్యను పరిష్కరించడంలో, సినిమా టికెట్ల ధరలు, ఐదు షోలకు అనుమతి ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ దిల్‌ రాజు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో సహాయపడిన అందరూ రుణపడి ఉంటానని చెప్పారు దిల్‌ రాజు.

 

Read more RELATED
Recommended to you

Latest news