రైలు ప‌ట్టాలపై ప‌బ్జీ.. అన్న‌ద‌మ్ముల మృతి

-

ప‌బ్జీ అనే ఆన్ లైన్ గేమ్ వ‌ల్ల అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. రైలు ప‌ట్టాల పై పబ్జీ గేమ్ ఆడుతున్న స‌మ‌యంలో రైలు రావడంతో అన్న‌ద‌మ్ములు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ లోని అల్వార్ జిల్లాలో వెలుగు చూసింది. అయితే రాజ‌స్థాన్ లోని అల్వాల్ జిల్లాలోని తెల్హా గ్రామంలో నివాసం ఉంటున్న ఒక కుటుంబానికి లోకేశ్ మీనా (22), రాహుల్ (19) ఉన్నారు.

అయితే పోటీ ప‌రీక్ష‌ల కోసం చ‌దువు కోవ‌డానికి రూప్ బాస్ అనే ప‌ట్ట‌ణంలో వారి సోద‌రి ఇంటి వ‌ద్ద ఉంటున్నారు. అయితే ఈ ఇద్ద‌రు అన్నద‌మ్ములకు ప‌బ్జీ అనే ఆన్ లైన్ గేమ్ ఆడే అల‌వాటు ఉంది. అయితే శ‌నివారం వారి ఇంటి వ‌ద్ద ఉన్న రైలు ప‌ట్టాలపై కూర్చిండి ప‌బ్జీ ఆడారు. అయితే ప‌బ్జీ ఆట‌లో నిమ‌గ్నం కావ‌డంతో రైలు వ‌స్తున్న విష‌యాన్ని కూడా గ‌మనించలేదు. దీంతో ట్రైన్ వారి ఢీ కొట్టింది.  దీంతో లోకేశ్ మీనా, రాహుల్ ఇద్ద‌రు కూడా అక్క‌డి కక్క‌డే మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version