పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై గృహ హింస కేసు… భార్యను వేధిస్తున్న ఏక్ నాథ్ రెడ్డి

-

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. భార్యను వేధిస్తున్న కారణంగా ఏక్ నాథ్ రెడ్డిపై గృహ హింస కేసు నమోదు అయింది. తనను ఇంట్లో ఉంచి గోడ కట్టేశాడని భార్య పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు ఏక్ నాథ్ రెడ్డి. భార్యను ఇంట్లో పెట్టేసి గోడ కట్టడాన్ని అందరూ తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏక్ నాథ్ రెడ్డికి బెంగళూర్ కు చెందిన మహిళతో వివాహం చేశారు. అయితే గత కొంత కాలంగా ఏక్ నాథ్ రెడ్డి హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనేందుకు భార్యపై అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఇద్దరూ విడాకుల కోసం అప్లై చేశారు. అయితే తనను గదిలో బందించిన విషయాన్ని బెంగళూర్ లో ఉన్న తండ్రికి చెప్పడంతో ఆయన పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఏక్ నాథ్ రెడ్డిపై వరకట్నం, గృహ హింస కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news