బాలీవుడ్ హీరోతో పూరి ‘జనగణమన’..!

-

ఎన్నో అంచనాల మధ్య భారీ హైప్ తో రిలీజ్ అయిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా కొట్టిన దెబ్బతో పూరి కోలుకోలేని స్థితిలోకి వెళ్లగా.. విజయ్ దేవరకొండ ఇక నుంచి తీసే చిత్రాలు ఆచితూచి చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నాడు. లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా పూరి తన నెక్స్ట్ మూవీ జనగణమన విజయ్ తోనే చేయాలని డిసైడ్ అయ్యాడు. విజయ్ కూడా ఆ సినిమా చూసేందుకు అప్పుడు చాలా ఉత్సాహం చూపాడు. కానీ లైగర్ రిలీజ్ తర్వాత లెక్కలు తారుమారయ్యాయి.

‘లైగర్’ మూవీ వైఫల్యం చూసిన తర్వాత బెదిరిపోయిన విజయ్ పూరితో జనగణమనకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక పూరి హీరో కోసం వెతుకుదామనుకుంటే.. స్టార్ హీరోలు కాదుకగా.. మిడ్ రేంజ్ హీరోలు కూడా తనకి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు పూరి దృష్టి బాలీవుడ్ హీరోలపై పడినట్లు సమాచారం.

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో టచ్ లోకి వెళ్లారట పూరి జగన్నాథ్. ఆగిపోయిన ‘జనగణమన’ సినిమాను వీరిద్దరిలో ఎవరో ఒకరితో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news