ఆ విషయంలో జగన్‌ నెంబర్‌ వన్‌ : ఆర్ కృష్ణయ్య

-

ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభ సీటుకు ఎంపికైన ఆర్‌ కృష్ణయ్య సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తాజాగా మాట్లాడుతూ.. మన దేశంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారని ఆర్. కృష్ణయ్య కొనియాడారు. వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు.

Sanction more college hostels: BC leader R Krishnaiah

అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం తాను పోరాడుతున్నానని… ఈ వర్గాలకు తాను మరింత సేవ చేసేందుకు జగన్ అవకాశం కల్పించారని అన్నారు. దేశంలో తొమ్మిది బీసీ పార్టీలు ఉన్నప్పటికీ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేదని… కేవలం వైసీపీ మాత్రమే పెట్టిందని కొనియాడారు. లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి జగన్ పాటుపడుతుండటం దేశమంతా చూస్తోందని ఆర్‌ కృష్ణయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news