లోకేష్ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు..నపుంసకుడి యాత్ర అంటూ !

-

ఏపీ లో నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నారా లోకేష్ పాదయాత్రపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..నపుంసకుడి యాత్ర అంటూ ఎద్దేవా చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఇవాళ లోకేష్ పాదయాత్రపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్‌ మీట్‌ పెట్టారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నపుంశకునికి వివాహం చేస్తే వంశాభివృద్ది ఎలా జరగదో లోకేష్ పాదయాత్ర వల్ల కూడా ఏ ప్రయోజనము లేదని ఫైర్‌ అయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర వంటి బలహీనమైన పాదయాత్ర దేశంలో ఎక్కడా జరగలేదని విమర్శలు చేశారు.

నాణ్యమైన కరెంట్ కోసం వ్యవసాయ మీటర్లు బిగిస్తె పగలగొట్టండి అని చెప్పడం లోకేష్ అవివేకమని ఆగ్రహించారు. లోకేష్ పొరపాటున ఆడపిల్లల్లా ఉండి ఉంటే వగలమాలిన ఏడుపులు చూడలేకపోయేవాళ్లు.. ప్రొద్దుటూరు చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా బిసి లకు గౌరవించి ప్రాధాన్యత ఇచ్చామమన్నారు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news