గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ హవా కనిపిస్తోంది : రఘురామకృష్ణ

-

ఏపీలో వైసీపీ రెబల్‌ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా.. ఎంపీ
రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరగనుండగా, ఇటీవల పోల్స్ సందడి పెరిగిందని, తాజాగా రాష్ట్రంలో పరిస్థితులపై సొంతంగా సర్వే చేయించానని పేర్కొన్నారు రఘురామకృష్ణ. తన సర్వేలో ప్రజల మొగ్గు టీడీపీ వైపేనని తెలిపారు. టీడీపీకి 90కి పైగా స్థానాలు లభించే అవకాశం ఉందని తెలిపారు రఘురామకృష్ణ.

జాతీయ మీడియాలో వచ్చిన సర్వేలు చూసి నిజమని నమ్మరాదని వైసీపీకి హితవు పలికారు రఘురామకృష్ణ. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ హవా కనిపిస్తోందని పేర్కొన్నారు రఘురామకృష్ణ. ఈ మేరకు తాను ఓ యాప్ ద్వారా సర్వే చేయించానని వెల్లడించారు రఘురామకృష్ణ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటారన్నది సర్వే ద్వారా స్పష్టమవుతోందని వివరించారు రఘురామకృష్ణ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version