తెలంగాణలో రాహుల్ టూర్ ఖరారు.. వరంగల్ సభలో పాల్గొనబోతున్న అగ్ర నేత

-

మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. రైతులకు బరోసా ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ వస్తున్నార‌ని.. తెలంగాణ ఇచ్చిన మనం.. ఇక్కడ బాధ పడుతున్న వర్గాలకు అండగా ఉండాలని నిర్ణయించిందని రేవంత్ స్పష్టం చేశారు. రైతులు కల్లాల్లో గుండె ఆగి చనిపోయినా పట్టించుకోలేదని కేసీఆర్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

బీజేపీ..trs రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు వేశాయని.. వరి వేస్తే ఊరే అని భయపెట్టార‌ని ఆగ్ర‌హించారు. కలెక్టర్ బెదిరించి… వరి వేయిద్దు అన్నందుకు ఆయనకు mlc ఇచ్చి ప్రమోషన్ ఇచ్చిందన్నారు.

కెసిఆర్ మాటలు నమ్మి కొందరు రైతు వరి సాగు చేయలేదని.. సాగు చేసిన వాళ్ళలో 30 శాతం మిల్లర్ల కు అమ్ముకున్నారన్నారు, కెసిఆర్..మోడీ మెడలు వంచి వరి కొనిచ్చినది కాంగ్రెస్ పార్టీ అని..దళారులను అమ్ముకున్నొడు మోసపోయారని మండిప‌డ్డారు.. కెసిఆర్ నీ నమ్మని వాడు మంచిగా ఉన్నాడు… కెసిఆర్ ఓ లంగా.. దొంగ మాటలు చెప్తారని ఆగ్ర‌హించారు. కెసిఆర్ మాటలు నమ్మకండి… కెసిఆర్ మాట సగం నమ్మి మోసపోయిన వాడు క్వింటాలు కి ఆరేడు వందలు నష్టపోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news