అలర్ట్ : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

-

నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో వారంలో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి జూన్ 10లోపు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.

1,160,494 Rain Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

తమిళనాడు, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా వంగి ఉంది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి మరఠ్వాడా కర్ణాటక మీదగా సముద్రమట్టాలనికి 1.5కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీని ఫలితంగా ఏపీలో రాగల రెండు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news