కొత్తిమీర సాగులో మెలుకువలు ,తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

ఎంత రుచికరమైన వంట అయిన కూడా కొత్తిమీర లేకుండా మాత్రం చెయ్యలెము..అంత రుచి ఉండదు.. అయితే తక్కువ ఖర్చులో పండించే ఈ పంటతో ఎక్కువ లాభాలను పొందవచ్చు..అయితే ఉత్తరప్రదేశ్‌లోని రైతులు నిరూపించారు. హర్దోయ్ జిల్లా రైతులు కొత్తిమీర సాగుని చేపట్టారు..కత్రి, కతియారి ప్రాంతాల్లో కొత్తిమీర సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. గంగా నది దిగువ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో రైతులు చాలా కాలంగా కొత్తిమీర సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న కొత్తిమీర ఉత్తమమైనదిగా గుర్తింపుని సొంతం చేసుకుంది. తేరా పుర్సౌలి గ్రామానికి చెందిన రైతు శివకుమార్ కొన్నేళ్లుగా వానాకాలం సీజన్‌లో కొత్తిమీరను సాగుచేస్తున్నాడు.ఈ సమయంలో పండించిన కొత్తిమీరకు మార్కెట్‌లో మంచి ధర వస్తుంది.

ఇప్పుడు పండించిన పంటను హోల్‌సేల్ గా కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కొత్తిమీర కొరత కారణంగా ఒక్కో మొక్కని రూ.10 వరకు విక్రయిస్తున్నారు. జూన్, జూలై నెలల్లో పొలాన్ని లోతుగా దున్నడంతో పాటు పొలంలోని గడ్డి, కలుపు మొక్కలను తొలగిస్తారు. కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ధనియాలు విత్తడానికి 15 రోజుల ముందు పొలంలో మందు వేస్తారు. ఇలా మందులు పిచికారీ చేయడం వల్ల పొలంలో కలుపు మొక్కలు నశిస్తాయి. పొలం సిద్ధం చేసే ముందు కుళ్లిన పేడ ఎరువును పొలంలో చల్లుతారు..

పంట వేసే ముందు పొలాన్నిదున్నిన తర్వాత సరైన పరిమాణంలో డీఏపీ, పొటాష్‌ని ఉపయోగించాలి. కొత్తిమీర సాగుకు హిసార్ సుగంధ విత్తనాన్ని పొలంలో ఉపయోగిస్తున్నారు. ఇది విత్తిన వెంటనే మొలకెత్తుతుంది. వానాకాలంలో గండ్లు వేసి కొత్తిమీర విత్తుతారు. కొత్తిమీరను నాటడానికి ముందు, దాని గింజలను జనపనార సంచిలో నానబెట్టాలి. ఇది మూడు నుండి నాలుగు రోజుల తర్వాత విత్తనాలు విత్తుకోవడానికి రెడీ అవుతాయి. దీనివల్ల విత్తనం బాగా మొలకెత్తుతుంది..
వర్షాకాలంలో తేమ కారణంగా అనేక రకాల కీటకాలు మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. చీడ నివారణకు తగిన మోతాదులో క్లోరోపైరిఫాస్ అనే ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. వర్షాకాలం తర్వాత ఈ కొత్తిమీర మార్కెట్‌లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మార్కెట్‌లో వర్షాకాలం రాకముందే వేసిన కొత్తిమీర మంచి ధర పలుకుతోంది..

ఒక హెక్టారులో దాదాపు 10 క్వింటాళ్ల పచ్చి కొత్తిమీర లభిస్తుంది. కొత్తిమీర విత్తనాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీనిని మసాలాగా కూడా ఉపయోగిస్తారు.భారతదేశంలో తయారయ్యే కూరల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తిమీర పొడి, పచ్చడి వంటి రాకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక్కోసారి కొత్తిమీర ధర క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతోంది. కొత్తిమీర ప్రతి దశలోనూ రైతుకు కాసుల వర్షం కురిపిస్తోందన్నారు.మొత్తానికి కొత్తిమీర వల్ల రైతులకు కాసుల వర్షం కురుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news