ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమ‌ల‌వుతోందంట‌.. లోకేశ్ సంచ‌ల‌న కామెంట్లు

-

ఈ మ‌ధ్య నారా లోకేశ్ బాగానే రాజ‌కీయ విద్య నేర్చుకున్నారు. ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు పాయింట్ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను క‌డిగి పారేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆలోచింప‌ద‌గ్గ విమ‌ర్శ‌లు చేస్తూ అంద‌రికీ షాక్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మార్కును చూపిస్తున్న నారా లోకేశ్ ఇప్పుడు మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు.

విశాఖపట్నంలో ఇటీవల మరణించిన డాక్టర్ సుధాకర్ గారి ఫొటోకు నివాళులు అర్పించి, ఆయ‌న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేద‌న్నారు.

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ దళితులను, మేధావులను వెంటాడి, వేధించి చంపేస్తున్నాడంటూ ఆరోపించారు. సుధాకర్ ది ప్రభుత్వ హత్యే అంటూ ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. ఒక మంచి డాక్ట‌ర్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ‌లి తీసుకుందంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news