సుమ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజీవ్..!!

-

తెలుగు బుల్లితెర పై నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై తన వ్యాఖ్యలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది సుమ. అయితే తాజాగా సుమ భర్త నటుడు రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. రాజీవ్ ఇంటర్వ్యూ లో భాగంగానే మాట్లాడుతూ..సుమ గురించి పలు షాకింగ్ విషయాలు తెలియజేశారు. ఎప్పుడు నవ్వుతూ అందరినీ సందడి చేసే సుమకి కోపం వస్తే చాలా కఠినంగా ఉంటుందని తెలియజేశారు.తాను ఇంట్లో ఏ విషయం గురించి అయినా గొడవపడితే కోపం వచ్చినా తన కోపం కొద్దిసేపు ఉంటుందని కానీ సుమ కోపం వస్తే చాలా భయంకరంగా ఉంటుందని తెలిపారు. ఏకంగా ఇంట్లో వాళ్లంతా రెండు మూడు రోజుల పాటు ఎవరు మాట్లాడుకోరని తెలియజేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా తమ మధ్య ఉన్న గొడవల గురించి కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎవరి ఇంట్లో గొడవలు అనేవి సహజంగానే ఉంటాయి. అయితే అవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయని తెలియజేశారు. ఇకపోతే సుమ ప్రస్తుతం బుల్లితెర పై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు కూడా హాజరవుతోంది.

ఇక ఈ మధ్య కాలంలోనే జయమ్మ పంచాయతీ అనే చిత్రం ద్వారా మొదటిసారిగా వెండితెరపై కనిపించింది. కానీ ఈ చిత్రంతో సుమ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పవచ్చు. సుమ స్టార్ యాంకర్ లలో ఒకరిగా ఉన్నదని చెప్పవచ్చు. ఇక సుమ ఏదైనా ఒక షో కి యాంకర్ గా పనిచేస్తోంది అంటే కచ్చితంగా ఆ షో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈమె అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించడం ఏ కాకుండా ఒక షో కి మంచి టీఆర్పీ రేటింగ్ తీసుకు రావడంలో కూడా ముందు ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈమె నెలకు రూ. 2.5 లక్షల పారితోషికం అందుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version