షాక్ అయ్యేలా మారిపోయిన ఇడియట్ సినిమా హీరోయిన్… చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు

-

‘రక్షిత’ పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. ఒక వేళ పరిచయం చేయాలంటే ‘ఇడియట్’ సినిమా ఒక్కటి చాలు. అంతగా తెలుగు ప్రజల మైండ్ లలో నిలిచిపోయింది ఆ సినిమా. ఇడియట్ సినిమా ద్వాారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కన్నడ కస్తూరి.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో ఆడిపాడింది. ముఖ్యంగా పూరిజగన్నాథ్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘ ఇడియట్’ సినిమాలో సూపర్ హిట్ కావడంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళం, కన్నడలో కూడా చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. 

తెలుగులో రక్షిత మెగాస్టార్ పక్కన ‘ అందరివాడు’, నాగార్జునతో ‘ శివమణి’, జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘ ఆంధ్రావాలా’ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే… కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతరువాత నుంచి సినిమాలకు దాదాపుగా దూరం అయింది.

అయితే ఎంతో అందంగా ఉండే రక్షిత ప్రస్తుతం బొద్దుగా మారింది. ఆమెను చూస్తే.. ఇప్పుడంతా షాక్ అవుతున్నారు. అసలు ఆ అందమైన రక్షిత ఈమెనా…? అని అనుకుంటున్నారు. ప్రస్తుతం కన్నడలో పలు టీవీషోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ రావడంతో ఇలా బొద్దుగా మారానని ఓ సందర్భంలో రక్షిత వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news