అల్లు అర్జున్, రామ్ చరణ్ తీపి అనుబందం..!!

-

అల్లు ఫ్యామిలీ, కొణిదెల ఫ్యామిలీ మధ్య అనుబందం ఆప్యాయత అనురాగాలు కలసి ఉంటాయి.సోషల్ మీడియాలో ఎంత రెచ్చ గొట్టే న్యూస్ వచ్చినా కూడా వారి బంధానికి మధ్య తూట్లు పడనివ్వలేదు. ఈ విషయాన్ని చిరంజీవి మరియు అల్లు అరవింద్ ప్రతి సారి చెబుతూనే ఉన్నారు. ఇక అల్లు అరవింద్ అయితే ఈ కట్టె కలేదాక చిరు పక్కనే ఉంటాను అని చెప్పాడు.

మరోసారి వారి మధ్య బంధాన్ని చూపెడుతూ కొణిదెల, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్కచోట కలిశారు. ఈసారి క్రిస్టమస్ సందర్భంగా శాంటా సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఈ ఫోటోలని షేర్ చేసింది.ఈ సెలెబ్రేషన్స్ కి అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్, వరుణ్ తేజ్, నిహారిక, సుస్మిత, ఉపాసన, శ్రీజ హాజరయ్యారు.

ఇటీవలే రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రిస్టమస్ వేడుకలు మెగా ఫ్యామిలి మరింత గ్రాండ్ గా జరపడానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. మా మధ్య తగాదాలు మీరు సృష్టించేవి మేము మాత్రం ఒక్కటే అని చాటి చెబుతున్నారు అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version