ACHARYA :మెగా ఫాన్స్ గుడ్ న్యూస్ : ”ఆచార్య” నుంచి చెర్రీ పోస్టర్ రిలీజ్

-

కొర‌టాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న “ఆచార్య‌” సినిమా పై మెగా ఫాన్స్ కు ఓ రేంజ్‌లో అంచ‌నాలున్నాయి. ఇందుకు కొర‌టాల చేసిన ప్ర‌తి సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. పైగా ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టికే చాలాసార్లు వాయిదా ప‌డింది.

అయితే వాస్తవానికి ఆచార్య సినిమా మే 13న రిలీజ్ కావాల్సి ఉండగా… కరోనా సెకండ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయి ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే తాజాగా చివరి షెడ్యూల్ కూడా మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్‌ చెందిన పోస్టర్ ను విడుదల చేశారు.

‘ది డోర్స్ టు ధర్మస్థలి హావ్ రీఓపెన్డ్’ అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం విగరస్ గా వర్కౌట్ చేసి చక్కని బాడీని బిల్డప్ చేసిన రామ్ చరణ్ ఈ పోస్టర్ లోనూ అదే ఫిజిక్ తో కనిపిస్తున్నాడు. దాంతో ఈ పోస్టర్ మెగాభిమానులకు కన్నుల పండగగా మారిపోయింది. ‘ఆచార్య’కు సంబంధించిన ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news