ఢిల్లోలో ఘోరం… దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారం…

-

దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. వావీవరసలు మరచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని వాళ్లను చిదిమేస్తున్నారు. ప్రభుత్వాలు నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. మృగాళ్లు తీరులో మార్పు రావడం లేదు. తాజాగా ఢిల్లీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు..

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మౌజ్ పూర్ కు చెందిన నిందితుడు రేహాన్ (34), అదే ప్రాంతానికి చెందిన దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నవంబర్ 21 నుంచి బాధితురాలిపై నిందితుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ తల్లి, సోదరి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు మూగ, చెవిటి మహిళ కావడంతో స్టేట్ మెంట్ రికార్డ్ చేయడానికి పోలీసులకు కష్టంగా మారింది.  దిల్లీ మహిళా కమిషన్ బాధితురాలికి న్యాయసహాయం అందించిందని, దివ్యాంగుల సంజ్ఞలను అర్థం చేసుకొనే ప్రైవేటు నిపుణుడిని పిలిపించి స్టేట్​మెంట్ నమోదు చేశామని వివరించారు. ప్రస్తుతం నిందితుడు రెహాన్ ను అరెస్ట్ చేసి..కోర్ట్ లో ప్రవేశపెట్టగా… న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news