పోల‌వ‌రం ప్రాజెక్టు కు త్వ‌ర‌లోనే రూ.700 కోట్లు విడుద‌ల : సోము వీర్రాజు

-

పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని ప్ర‌శ్నించారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పజెప్పేయండి.. మేమే నిర్మిస్తామ‌ని సోము వీర్రాజు స‌వాల్ విసిరారు.

పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చామ‌ని.. మరో రూ. 700 కోట్లు ఇవ్వాల్సి ఉంది.. దీన్ని త్వరలో విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు సోము వీర్రాజు. పోలవరం కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నామ‌ని…తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే షెకావత్తును తప్పు పడతారా..? అని నిప్పులు చెరిగారు. షెకావత్తుకు ఏం తెలీదని ఈ ప్రభుత్వం అనుకుంటోందా..? తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారా..? అని ఫైర్ అయ్యారు. ఇదే కేంద్ర మంత్రి షెకావత్ పుట్టిన రోజు పండుగలు ఇదే నేతలు చేయలేదా..? అని నిల‌దీశారు.

Read more RELATED
Recommended to you

Latest news