Rashmika Mandanna : యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన రష్మిక

-

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రష్మిక మందన కు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ సాధించాయి.


ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన తాజాగా మరో బిజినెస్ మొదలు పెట్టింది. ఇవాళ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది హీరోయిన్ రష్మిక. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా రష్మిక ప్రకటన చేసింది.

తన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఓ వీడియోను కూడా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది ఈ బ్యూటీ. రష్మిక మందన ఇతర సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక రష్మిక చెప్పడంతోనే ఆమె ఫ్యాన్స్… యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు. తామే ముందు subscribe  చేశామంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news