దేవరకొండతో మాల్దీవులకు రష్మిక..కారణం ఇదే

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడి గీతాగోవిందం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరు నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అయితే ఈ రెండు సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం మరింతగా బలపడిందని చెప్పాలి.

ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం , పబ్ , టూరు, షికారు అంటూ తెగ చక్కర్లు కొడుతూ ఉంటారు. అయితే తాజాగా క్యూట్ హీరోయిన్ రష్మిక మందన ముంబై ఎయిర్పోర్టులో తలుక్కుమన్నారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆమె నటించిన ‘గుడ్ బై’ సినిమా శుక్రవారం ఉదయమే ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా, మంచి టాక్ అందుకుంది.

ఈ నేపథ్యంలో ఆమె వకేషన్ ట్రిప్ కు పయనం అయినట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్ పోర్టుకు రష్మిక రావడానికి కాస్త ముందే స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా చేరుకోవడం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారింది. ఈ సూపర్ హిట్ జోడి మాల్దీవుల ట్రిప్ కు వెళ్తోందంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు కలిసి రొమాంటిక్ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నారని కొన్ని ఆంగ్ల పత్రికలు రాశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version