సీఎం జగన్‌కు లేఖ రాసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

-

రియల్ ఎస్టేట్ వ్యాపారి…. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను అడ్రస్ చేస్తూ సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరులోని కొరిటపాడుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి గిరిధర్‌ వర్మ .. గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి వద్ద రూ.5లక్షలు అప్పతీసుకున్నాడు. రూ.5లక్షలు తిరిగి చెల్లించినా ఇంకా కట్టాలని, డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెంకటరెడ్డి బెదిరించాడని లేఖలో పేర్కొన్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని సీఎం జగన్‌ను అడ్రస్‌ చేస్తూ.. సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొరిటపాడుకు చెందిన గిరిధర్‌ 3 నెలల క్రితం హైదరాబాద్‌ కుషాయిగూడలోని ఆదిత్యనగర్‌కు వచ్చి అద్దె గదిలో ఉంటున్నాడు. రాత్రి బంధువుల ఇంట్లో భోజనం చేసి.. తెల్లారే సరికి విగతజీవుడై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news