మార్చి 30లోపు దళిత బంధు నిధులు విడుదల : హరీష్ రావు

-

సంగారెడ్డి జిల్లా కేంద్రం కలెక్టరేట్‌ లో దళిత బంధు కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 30వ తేదీలోపు ప్రతి నియోజక వర్గంలో 100 మంది దళితులకు దళిత బంధు పంపిణీ అవుతుందని ప్రకటన చేశారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఎన్నిక కోసమే ఆన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు…ఇప్పుడు సమాధానం చెప్పాలని ఫైర్‌ అయ్యారు.

harishrao
harishrao

తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, దళిత బంధులను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా కేంద్రం ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంచి చేయకపోయిన చెడు మాత్రం చేయొద్దని.. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లో 2 లక్షలు ఆర్మీ లో 3 లక్షల ఉద్యోగాలు వున్నాయి ముందు వాటిని భర్తించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఖాళీగా వున్న ఉద్యోగాల వివరాల పై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news