చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

సీనియర్‌ నటి కేపీఏసీ లలిత మంగళవారం త్రిపునితురలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ లెజెండరీ నటి ఒకప్పుడు మలయాళం సినిమా కమర్షియల్‌ అండ్‌ ఆర్ట్‌ స్కూల్‌ రెండింటిలోనూ బాగా రాణించింది.

కేపీఏసీ లలిత అసు పేరు మహేశ్వరి అమ్మ. ఆమె చాలా సంవత్సాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. ఆమె ఐద దశాబ్దాల తన కెరీర్‌ లో ఏకంగా 550 సినిమాలకు పైగా నటించారు. ఇక సీనియర్‌ నటి కేపీఏసీ లలిత మరణం పట్ల పలుగురు సినీ నటులు, నిర్మాతలు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news