గుర్రం జాషువా కూతురి పాత్రలో రేణూ దేశాయ్​ రీఎంట్రీ

-

70వ దశకంలో పేరు మోసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందుతోందుతోన్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రేణూ దేశాయ్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించనున్నారు రేణు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘‘హేమలతా లవణం లాంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటానని నమ్మినందుకు దర్శకుడు వంశీకృష్ణకు నా కృతజ్ఞతలు’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రేణు.

దిగ్గజ రచయిత.. సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తే.. హేమలతా లవణం. ఆమె తన భర్త గోపరాజు లవణంతో కలిసి అంటరానితనం – కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. జోగిని దురాచార నిర్మూలన – నేరస్థుల సంస్కరణల కోసం అవిరళ కృషి చేశారు. బందిపోట్ల సంస్కరణ కోసం మధ్యప్రదేశ్‌ అడవుల్లో పాదయాత్ర చేశారు. ఎంతో మంది దొంగలు తమ వృత్తిని వీడి సామాన్య జీవనం గడపడానికి హేమలత కృషి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news