వైఎస్‌ షర్మిలపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ కోడలని షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తెలంగాణ కోడలైతే..తాను తెలంగాణ ఆడబిడ్డనన్నారు. షర్మిల ఏదైనా అడగొచ్చు.. ట్యాక్స్ ఏమీ లేదు కదా..కానీ ఏదన్నా అడగడానికి అర్హత ఉండాలన్నారు. పార్టీ విలీనంపై షర్మిల, రాహుల్, సోనియాను కలిసారంతే.. కానీ వాళ్లు ఇంకా ఏం చెప్పలేదన్నారు. షర్మిల తెలంగాణలో పోటీచేసే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ లో చేరికకు షర్మిల ఒక్కరే ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని సెటైర్ వేశారు.

Renuka Chowdhury : తెలంగాణ కోడలు అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అలాంటి  వాళ్లను రాజకీయ రాబందులు అంటారు- వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత ...

షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలన్నారు.వైఎస్సార్ టీపీ విలీనంపై ఇటీవల వైఎస్ షర్మిల ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే విలీనాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం స్వాగతిస్తుంది. ఈ క్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరో వైపు పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news