Big News : రేపు రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ దినోత్సవం

-

ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితమయ్యాయి. పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరగలేదు. అయితే గణతంత్ర వేడుకలకు సంబంధించి రాజ్ భవన్ లోనే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన రాజ్ భవన్ లో ఉదయం జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరిస్తారు. రాజ్‌ భవన్‌లోనే అరగంటపాటు పోలీస్‌ పరేడ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రేపు ఉదయం 6.50 నుంచి రాజ్‌భవన్‌లో పరేడ్‌ ఉంటుంది. అయితే.. సాయంత్రం పూట రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత ఏడాది కూడ రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు గత ఏడాది కేసీఆర్ దూరంగా ఉన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ కొనసాగుతుంది. ఈ గ్యాప్ గణతంత్ర దినోత్సవ వేడుకలపై పడింది. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాకుండా గవర్నర్ స్వంతంగా ఉపన్యాసం చేయడం అధికార పార్టీకి కోపం తెప్పించిందనే ప్రచారం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news