రైతు రుణామాఫీ పేరుతో రేవంత్ సర్కార్ నయా మోసము :బీజేపీ ఎంపీ డీకే అరుణ

-

రాష్ట్రంలో రైతు రుణామాఫీ పేరుతో రేవంత్ సర్కార్ నయా మోసానికి తెర లేపిందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ సెన్సేషనల్ కామెంట్ చేశారు.ఇవాళ హైదరాబాద్‌లో ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లడుతూ.. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టి.. ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ అంటూ ఊరూరా హడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు. రూ.లక్ష లోపు తీసుకున్న రుణాల్లో అందులో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ముప్పుతిప్పలు పడుతోందని ఆమె అన్నారు.

ఇక గత్యంతరం లేక ఖరీఫ్ రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణ మాఫీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క మహబూబ్‌నగర్ పరిధిలోని ఒక్క డీసీసీ బ్యాంక్‌లో 68,495 మంది రైతులు అప్పులు తీసుకున్నాని..అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 51,415 మంది ఉంటే వారిలో ప్రభుత్వం 20,130 మందికి మాత్రమే రుణమాఫీ చేసిందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ.. ప్రజలను నిండా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా రుణమాఫీ మొత్తం చేశామంటూ ముఖ్యమంత్రితో సహా మంత్రులు మీడియా ముందు చెప్పడం హాస్యా్స్పదంగాఉందని డీకే అరుణ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version