మై పీపుల్… మై స్ట్రెంత్… నా ప్రజలు.. నా బలం : రేవంత్‌ రెడ్డి

-

తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తన అభిమానులు, కార్యకర్తల కోలాహలానికి సంబంధించిన వీడియోను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ రీట్వీట్ చేసింది. మై పీపుల్… మై స్ట్రెంత్… నా ప్రజలు.. నా బలం అని ట్వీట్ చేశారు. తన అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్‌లో ఈ రోజు పర్యటించానని పేర్కొన్నారు. 2.13 సెకండ్ల వీడియోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆయనకు జై కొడుతూ నినాదాలు చేశారు. నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ సాధించి పెట్టాలని కోరారు. ర్యాలీగా బయలుదేరిన ఆయన అభిమానులకు, కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వీడియోకు గంటలోనే 1600కు పైగా లైక్స్, 363కు పైగా షేర్లు అయ్యాయి. దాదాపు 15వేల మంది చూశారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ లో వివిధ పార్టీలకు చెందిన నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. మద్దూరు, కొత్తపల్లి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త, సీనియర్ నాయకులు హమ్మిరెడ్డి, కొత్తపల్లి మండల పరిధిలోని దుప్పటి గట్టు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి, నాగంపల్లి,నాగిరెడ్డి పల్లి గ్రామాలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రేవంత్ రెడ్డి నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version