మునుగోడు గెలిస్తే.. 2023లో 100 సీట్లు కాంగ్రెస్ గెలవడం ఖాయం-రేవంత్

-

మునుగోడు గడ్డపై కాంగ్రెస్ గెలిస్తే.. 2023లో 100 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులకు మేం సహజ మిత్రులమని.. మనం కలిసి పనిచేద్దాం.. కింది స్థాయి కార్యకర్తలు మద్దతు ఇవ్వండని కోరారు.

కమ్యూనిస్టులను నేను ఎప్పుడూ అవమానపరచలేదని.. అలా అని నిరూపిస్తే.. ధర్మ బిక్షం విగ్రహం ముందే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. మన తెలంగాణలో మనం పరాయి వాళ్ళలా బతకాల్సిన పరిస్థితి ఉందని… ఇవాళ కిరాయి వాళ్ళు వచ్చి తెలంగాణను ఏలుకుంటున్నారని వివరించారు. వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని… వచ్చే కాంగ్రేస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కచ్చితంగా మునుగోడు గడ్డపై కాంగ్రెస్ గెలిస్తే..తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news