చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు – కోమటిరెడ్డి

-

తెలంగాణ వచ్చాక కూడా నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అని ప్రశ్నించేవారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. కేసీఆర్ నమ్మి అధికారం అప్పగిస్తే… తెలంగాణ నా రాజ్యం, నేను రాజు అని అనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడని మండిపడ్డారు.

మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోచుకుని అప్పుల పాల్జేయడమే కాకుండా నిరుద్యోగుల పొట్టకొట్టారని మండిపడ్డారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పేపర్ లీకేజీతో నిరుద్యోగులు బాధపడుతుంటే బిడ్డను కాపాడుకునేందుకు ఢిల్లీకి పోతున్న కేసీఆర్ కేబినెట్ కు సిగ్గు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ భయస్తుడని… ప్రజలు అడ్డుకుని నిలదీస్తారని సెక్యూరిటీని పెట్టుకున్నడని ఎద్దేవా చేశారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీదేనన్న రాజగోపాల్ రెడ్డి… అమిత్ షా అడుగుపెడితే భయంతో వణికిపోయి పైసలు వెదజల్లి అక్రమంగా గెలిచారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో లేని కోన్ కిస్కా రేవంత్ రెడ్డి అప్పులపాలైన తెలంగాణను ఎట్లా కాపాడతాడని అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నడని కీలక ఆరోపణలు చేశారు రాజగోపాల్ రెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ కు బీజేపీ కార్యకర్తలు బుద్ది చెప్పడం ఖాయం అన్నారు. మనమంతా యుద్దానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news