ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి – రేవంత్

-

మిడ్ మానేరు నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌ తో వేములవాడ కాంగ్రెస్‌ నాయకులు ఆది శ్రీనివాస్ ధర్నాకు దిగారు. అయితే.. ఈ ధర్నా నేపథ్యంలోనే.. ఆది శ్రీనివాస్ ను అరెస్ట్‌ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.


పరిహారం కోసం వేములవాడలో ధర్నా చేస్తున్న మిడ్ మానేరు నిర్వాసితులపై పోలీసుల దౌర్జన్యం దుర్మార్గమన్నారు. ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నిర్వాసితుల అరెస్టును ఖండిస్తున్నానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్టును ఖండిస్తున్నానని… అరెస్టు చేసిన నిర్వాసితులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్. కేసీఆర్ హామీ ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news