కేసీఆర్ నుండి మేం సాయం పొందితే మేం సర్వనాశనం అవుతాం : రేవంత్‌

-

 

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల రగడ ఇంకా కొనసాగుతుంది. మునుగోడు ఎన్నికల కోసం కేసీఆర్ నుండి కాంగ్రెస్ కు రూ.25 కోట్లు అందాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో స్పందించిన రేవంత్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానని..ఈటెల చేసిన ఆరోపణలపై కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీనితో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.

 

నేను హిందువును... అబద్ధం చెబితే సర్వనాశనం అవుతా: అమ్మవారి సాక్షిగా రేవంత్  ప్రమాణం

 

“నేను హిందువును… దేవుడ్ని నమ్ముతాను.. అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను… ఇప్పుడే పూజారీ నాకు అమ్మవారి కండువా కప్పారు.. ఈ కండువా కప్పుకొని ఒట్టేసి చెబుతున్నాను.. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన.. కేసీఆర్ నుండి మేం సాయం పొందితే మేం సర్వనాశనం అవుతాం” అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేశారు. ఈ తొమ్మిదేళ్లలో తనపై కక్ష పూరితంగా కేసులు పెట్టిన కేసీఆర్ తో ఎలా కలుస్తానని చెప్పారు. తన కూతురు పెళ్లికి వచ్చేందుకు కూడా ఇబ్బందులు పెట్టారన్నారు. ఈటల దేవుడిని నమ్ముతాడో లేదోనని, తాము నమ్ముతామని, అందుకే ఒట్టు వేశానని చెప్పారు. కేసీఆర్ నుండి సాయం పొంది ఉంటే తాము సర్వనాశనం అవుతామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news