బ్రోకర్లను పట్టుకుని తిరుగుతున్నారు..చిన జీయర్‌ పై రేవంత్‌ సంచలనం

-

చిన్న జీయర్‌ స్వామిజీ ఆశ్రమంలో త్వరలోనే రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరించనున్నారు. అయితే.. దీనిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమానత్వం అని టైటిల్ పెట్టి- ఒక ఎంపీని- పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నాకు రియలేస్టేట్ ఉద్యోగితో ఆహ్వానం పంపుతారా ? అని చిన్న జీయర్‌ బృందంపై ఫైర్‌ అయ్యారు. చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి మాకు ఆహ్వానం ఎందుకు రాలేదు? రియలేస్టేట్ వ్యవస్థ కోసం చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారని నిప్పులు చెరిగారు.


చిన్నజీయర్ స్వామీజీ పై మాకు అపారమైన గౌరవం ఉందని.. రియలేస్టేట్ బ్రోకర్ ను పక్కన పెట్టుకొని తిరిగితే మాకు అనుమానాలు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామి ల్యాండ్ గ్రాబర్ ను పక్కన పెట్టుకోని వ్యవస్థను ఒక కంపెనీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని.. మైం హోం రామేశ్వర్‌ రావు ఉద్దేశించి ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. మోడీ ఏమి భక్తుడొ ఆయనకే తెలియాలని.. చైనా విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్లడం ఏంటోనని ప్రశ్నించారు. స్వామీజీ అంతగొప్ప కార్యక్రమం- ఒక రియలేస్టేట్ సంస్థ కోసం చేస్తున్నారా? అనిప్రశ్నించారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ ముందు మాత్రం సమానత్వం కనిపించడం లేదన్నారు. చిన్నజీయర్ స్వామి దగ్గర రియలేస్టేట్ వ్యక్తులు ఉంటే ఆయన గౌరవమే తగ్గుతుందని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news