కృష్ణ మరణం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి..!

-

తెలుగు సినీ పరిశ్రమ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఈరోజు తెల్లవారుజామున సూపర్ స్టార్ కృష్ణ 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీ కే కాదు రాజకీయ రంగానికి అలాగే ప్రజలకు కూడా తీరనిలోటు అని చెప్పాలి. నటుడిగా ప్రేక్షకులను ఎంతగా అయితే అలరించాడో ..ఒక రాజకీయవేత్తగా కూడా అంతే బాగా ప్రజలను పాలించారు. ఇంతటి గొప్ప లెజెండ్రీ యాక్టర్ , రాజకీయవేత్త మరణించడంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురి అయ్యి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా అందరూ కృష్ణ మరణం పై బాధ వ్యక్తం చేస్తుంటే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆర్జీవి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదం లోకి తల దూర్చాడనే చెప్పాలి.

వర్మ సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల బాధ పడాల్సిన అవసరం లేదు అని ట్వీట్ చేశాడు. తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా..” బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వర్గంలో కృష్ణ, విజయనిర్మల కలసి పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతుంటారని అనుకుంటున్నాను”అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడమే కాదు కృష్ణ, విజయనిర్మల కలిసిన నటించిన “మోసగాళ్లకు మోసగాడు” సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ను కూడా షేర్ చేశాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది కృష్ణ గారు చనిపోయి అందరూ సంతాపం తెలియజేస్తుంటే మీరు ఇలా కామెడీ భరితమైన ట్వీట్లు చేయడం ఏమాత్రం సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.. మరికొంతమంది ఆర్జీవి చెప్పింది కరెక్టే కదా అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే వర్మ ఏమి చేసినా సెన్సేషన్ అవుతుంది కాబట్టి వర్మ ఎలాంటి పోస్ట్ చేసినా సరే అది కాంట్రవర్సీలకు దారితీస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇంతలా కాంట్రవర్సీలకు తెరలేపే వర్మ అంటే ఇండస్ట్రీలో చాలామందికి రెస్పెక్ట్ మాత్రమే కాదు అభిమానులలో కూడా ఆయనపై మంచి అభిప్రాయం ఉందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news