అమితాబ్ కి కరోనా.. చావు మాత్రం పక్కా..! కానీ..? : వర్మ

-

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి క‌రోనా సోకింద‌నే వార్తపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించాడు. ‘సర్కార్.. కరోనా బ్యాక్ మీద తన్ని ఎప్పటిలాగే మీరు ఇంకా ఆరోగ్యంగా తిరిగి వస్తారని నాకు తెలుసు. అందుకే మీ కోసం ప్రార్థించ‌ను. కానీ నేను కరోనా కోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఇలా చేసినందుకు అది ప‌క్కాగా చచ్చిపోతుంది’ అని వర్మ తన స్టైల్లో అమితాబ్ గురించి రాసుకొచ్చాడు.

అయితే ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ విషయమై ఇప్పటికే చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. దేన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే వర్మ.. ఇలాంటి సెన్సిటివ్ విషయంలోనూ తన క్రియేటివిటీకి పదును పెట్టడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news