జగన్‌ కు షాక్‌.. ఋషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో సీరియస్‌

-

ఋషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ది పేరిట కొండలను కొట్టేస్తున్నారని.. మరో వైపు అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలో విభిన్న వైఖరులు ఏంటి అని నిలదీసింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్లు కనిపిస్తుందని పేర్కొంది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయమని పంపుతానని.. కమిటీ వేస్తే మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.


9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే… 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు కే.ఎస్‌ మూర్తి, అశ్వినీ కుమార్ కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్‌ లను అందించారు పిటీషనర్ తరపు న్యాయవాదులు. తాము 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని చెప్పారు ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా అని ప్రశ్నించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. తాను ఆఫిడవిట్ దాఖలు చేస్తానని, అప్పటివరకూ సమయం ఇవ్వాలని కోరారు ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు ఉందని సందేహం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం. మీరు అఫిడవిట్ వేసిన తరువాత నిజానిజాలు తేలుస్తామని చెప్పిన ధర్మాసనం.. కేసు విచారణ నవంబర్ 3కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news