చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..!

-

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సొరకాయలపేట చెరువు కట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

మృతులు దామోదర్ (45), సుజనమ్మ (40), వెంకట్రామయ్య (55), గోవర్థిని(25), పార్వతమ్మగా పోలీసులు గుర్తించారు. అలాగే మృతులంతా కలకడ మండలం కొత్తగాండ్లపల్లికి చెందిన వారిగా పోలీసులు చెప్తున్నారు. వీరంతా తమ బంధువు అంత్యక్రియలకు వచ్చి తిరిగి వారి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news