జూనియర్ ఎన్టీఆర్ సరసన రోహిత్ శర్మ… ఏ విషయంలో తెలుసా..?

-

ఐపీఎల్ 2022లో ముంబై జట్టు దారుణంగా విఫలం అవుతోంది. కెప్టెన్ గా రోహిత్ శర్శ కూడా అన్ని మ్యాచుల్లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఒక్క కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా ఆడటం లేదు. ఐపీఎల్ లో ఘనమైన చరిత్ర, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, బ్రాండ్ వ్యాల్యూ కలిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో దారుణంగా విఫలం అవుతున్నారు. వరసగా 8 మ్యాచుల్లో ఓడిపోయి సెమిస్ అవకాశాలు లేకుండా చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ మరో విషయంలో వార్తల్లో నానుతున్నాడు. ఇటీవల రోహిత్ శర్మ లాంబోర్గిని ఉరస్ లగ్జరీ ఎయూవీ కార్ ను కొన్నాడు. దీని విలువ దాదాపుగా రూ. 3.15 కోట్లుగా ఉంది. ఇండియన్ క్రికెట్ జెర్నీ రంగులో బ్లూ  కలర్ లోనే రోహిత్ శర్మ కొత్త కారు ధగధగ మెరిసిపోతోంది. లంబోర్గిని ఉరుస్ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది, ఇది 650 PS పవర్ మరియు 850 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కలిగి ఉంది. అన్ని ఆధునాతన ఫీచర్లు ఈ కార్ సొంతం.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్ ను కోనుగోలు చేశాడు. రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి వంటి సెలబ్రెటీలు లాంబోర్గిని ఉరస్ కారును కొన్నవారి జాబితాలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version