పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మంత్రి రోజా సెటైర్లు !

-

పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఒక అధ్యక్షుడు పార్టీ పెట్టిన తర్వాత… ఆ కార్యకర్తులు గౌరవంగా తమ పార్టీ జెండాని ఎత్తుకొని నడిచే విధంగా ఆ నాయకుడు ఉండాలని..రోజా అన్నారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం… తన కార్యకర్తలతో ఏ ఎలక్షన్ కు ఏ పార్టీ జెండా మొపిస్తాడో అని తెలియకుండా కన్ఫ్యూషన్ లో కార్యకర్తలు ఉన్నారని ఎద్దేవా చేశారు.

కాబట్టే ఎప్పుడు ఎవరిని తిట్టాలో అర్థం కాకుండా వాళ్ళ ఇష్టానికి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. ఓటు చీల కూడదంటూ.. ఓటు చీల్చే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు.. ఈ రోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ఏం చేశారని సూటిగా అడుగుతున్నానని ఆగ్రహించారు. జగన్ గారు ఒకరే ఇచ్చిన మాటకు కట్టుబడి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఎన్ని పార్టీలు ఒక్కటైనా.. ఏం చేయాలేరన్నారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news