BREAKING: పొదల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు.. ప్రయాణికులకు గాయాలు

-

బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లో పొదల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. టిప్పుఖాన్ బ్రిడ్జి సమీపంలోని రోడ్డు పక్కన పొదల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికుల సహాయంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

డ్రైవర్ అజాగ్రత్త, మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ చేతికి ముందే గాయం ఉందని అయినా అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని అంటున్నాడు. ఎదురుగా కారు రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు పొదల్లోకి దూసుకెళ్లిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news