ఆర్టీసీ న్యూ ఇయర్‌ ఆఫర్‌.. ఇవాళ వారికి ఉచితంగా ప్రయాణం

-

కొత్త సంవత్సరం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన అంటే ఇవాళ 12 సంవత్సరాల లోపు పిల్లలకు అలాగే వారి తల్లిదండ్రులకు ఆర్.టి.సి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ప్రయాణికులను ఆకర్షించే ఉద్దేశంతో సరికొత్త విధంగా ఈ ఆఫర్ను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ.

ఈ ఆఫర్ పై అధికారులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో హైదరాబాద్ లోని ప్రయాణికులు ఆర్టీసీ ఆఫర్ను సద్వినియోగం చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. కాగా.. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి… వినూత్న రీతిలో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫర్లే కాకుండా ఆర్టీసీ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పలుమార్లు సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించారు ఆర్టిసి ఎండి సజ్జనార్

Read more RELATED
Recommended to you

Latest news