అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నా !

-

వైసిపి సీనియర్ నేత, రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల పై తన సోషల్ మీడియా వేదికగా అనే విమర్శలు సంధిస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి… సెటైర్లు పిలుస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చన్నై నాయుడు ని టార్గెట్ చేశారు. అండమాన్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకం అవుతారంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.  ఇక తాజాగా “త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయి…మళ్ళీ తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని చంద్రబాబు ప్రగల్భాలు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరక్క నానాఅగచాట్లు పడ్డ వాస్తవం మరచిపోయి ఇప్పుడు పగటికలలు కంటున్నారు. గెలుపు దేవుడెరుగు. ముందస్తు వస్తే ఈసారి మీ ప్రతిపక్షహోదాకే మూడుతుంది బాబూ” అంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

” అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (2 వార్డులు) గెలిచినందుకు టీడీపీ విజయోత్సవం జరుపుకుంటోంది. ఆంధ్రాలో ఇక ‘పార్టీలేదు-బొక్కాలేద’ని నిర్ధారించుకున్న అచ్చెన్న కూడా త్వరలో అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.” అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news