ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల

-

ఏపీలో ముందస్తు ఎన్నికల వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని టాక్ నడిచింది. అయితే ముందస్తు ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నిలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ వైఖరిని వెల్లడించిన సజ్జల… మరోసారి స్పష్టత ఇచ్చారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేది మీడియా సృష్టి అని, కొన్ని పార్టీలు ముందస్తు అని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం సజ్జల చేశారు.

Andhra Pradesh: Sajjala Ramakrishna Reddy slams TDP leaders for creating  scare on Covid

తమ ప్రభుత్వానికి ప్రజలు నిర్దేశించిన మేరకు చివరి రోజు వరకు పాలన కొనసాగుతుందని, తమ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని వివరించారు. చంద్రబాబు ముందస్తు అంటూ ప్రణాళికలు వేసుకుంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news