విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు : సజ్జల

-

ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అయితే.. జనసేనతో టీడీపీ పొత్తు సిద్ధంగా ఉన్నట్లే కనిపించినా.. బీజేపీ పొత్తుపై అస్పష్టత నెలకొంది. అయితే.. పొత్తులపై ప్రభుత్వం సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విపక్ష పార్టీలపై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగులన్నీ చంద్రబాబువి అని.. పవన్ ఏదో వ్యూహం అంటున్నారు, ఇంతకీ వ్యూహం అంటే ఏంటి? అని ప్రశ్నించారు సజ్జల.

‘‘ఒకరేమో త్యాగాలకు సిద్ధమంటారు, మరొకరు నేనే సీఎం అంటారు, ఇంకొకరు మేం కలవమంటారు, అసలు విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు’’ అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకోవడం కరెక్ట్ కాదని, అసలు పొత్తులు పెట్టుకోవడమంటే అదేదో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని సెటైర్ వేసిన సజ్జల.. పవన్, చంద్రబాబు పొత్తులోనే ఉన్నారని.. చంద్రబాబు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version