Samantha : జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో సమంత సందడి

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్​లో సందడి చేసింది. జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మగుడిని సందర్శించింది. అమ్మవారిని దర్శించుకొని సారె సమర్పించింది. తన తాజా చిత్రం శాకుంతలం విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్, కథానాయకుడు దేవ్ మోహన్, నిర్మాతలు నీలిమా గుణ, హర్షితాలతో కలిసి పెద్దమ్మగుడికి వచ్చింది. భక్తులతో కలిసి అతి సాధారణంగా అమ్మవారి దర్శనం చేసుకుంది. శాకుంతలం సినిమా ప్రచారాన్ని అమ్మవారి గుడి నుంచి మొదలుపెట్టామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత ఇక తన సినిమా షూటింగులు, ప్రచారంపై ఫోకస్ చేసింది. మొన్నటిదాక సిటాడెల్ వెబ్​సిరీస్ షూటింగ్​లో పాల్గొంది. ఆ షూటింగ్​లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న క్రమంలో గాయాలపాలైంది. అనంతరం ఖుషి సినిమా షూటింగ్​ కోసం హైదరాబాద్ వచ్చింది. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. శాకుంతలం చిత్రాన్ని గుణశేఖర్ ఎంతో అందంగా తీర్చిదిద్దారని.. ఈ మూవీ తనకు ఎప్పటికీ స్పెషలేనని సమంత చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news