ఈనెల 27న బహిరంగ సభ నిర్వహించి తీరుతాం – సంగప్ప

-

3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకుని ఈనెల 27న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడంపట్ల బీజేపీ నేత జె.సంగప్ప ఆగ్రహించారు. ఈనెల 27న బహిరంగ సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు సంగప్ప.

కేసీఆర్.. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. బహిరంగ సభకు అన్ని అనుమతులిచ్చి ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతి రద్దు చేయడం సిగ్గుమాలిన చర్య అని.. ఇంతకంటే దుర్మార్గమేమైనా ఉందా? ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను అడ్డుకునే హక్కు నీకెక్కడిది? అని నిలదీశారు.

కేసీఆర్.. మీకు పోయేకాలం దగ్గరకు వచ్చింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నావని… ఒక్కటి గుర్తుంచుకో… ఎంతగా అణిచివేస్తే.. అంతగా తిరుగుబాటు మొదలవుతుందనే సత్యాన్ని గుర్తుంచుకో అని వార్నింగ్‌ ఇచ్చారు. బండి సంజయ్ పాదయాత్రతో పీఠాలు కదిలిపోతున్నాయనే భయంతోనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఢిల్లీలోని లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ పాత్రపై చర్చను దారి మళ్లించేందుకే ఇలాంటి నీచానికి ఒడిగట్టడం దారుణం… సూర్యుడిని అరచేతిలో ఆపలేవు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే యత్నం చేస్తే మాడి మసైపోతావ్.. జాగ్రత్త అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news