హిందుగాళ్లు… బొందుగాళ్లు అన్న కేసీఆర్…హిందువుల ద్రోహి – విజయశాంతి

-

హిందుగాళ్లు… బొందుగాళ్లు అన్న కేసీఆర్…హిందువుల ద్రోహి అంటూ విజయశాంతి ఆగ్రహించారు. తమ మతాన్ని మాత్రం ప్రేమిస్తూ, పరమతస్తుల్ని ద్వేషించేవారు చాలామందే కనిపిస్తుంటారు. కానీ, తెలంగాణ సీఎం కేసిఆర్ ఇందుకు భిన్నం. గొప్ప హిందువుగా చెప్పుకునే ఆయన… ఆ హిందూ మతాన్నే కించపరుస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ అన్య మతాల్ని మాత్రం అమితంగా ప్రేమిస్తుంటాడన్నారు. హిందువుల గురించి బహిరంగ సభల్లో హిందుగాళ్లు… బొందుగాళ్లు అన్న ఈ పెద్ద మనిషి…. ఇతర మతాలవారు హిందువుల పట్ల ఎంత ఘోరమైన అవమానాలకు పాల్పడినా పట్టించుకోడని మండిపడ్డారు.

హైందవ మత విశ్వాసాలను పాటించే హిందువులు, బీజేపీ వారిని ఉద్దేశించి మతపిచ్చి అంటూ పరిహాసం చెయ్యడం కేసీఆర్‌కి బాగా అలవాటు. ఆయన చేతికి ఎప్పుడూ కనిపించే దర్గా దట్టీ చూసి ఆయనకు కూడా మత పిచ్చి ఉందని అనొచ్చు కానీ ఏనాడూ ఆయన్ని ఉద్దేశించి అలా అనలేదు. మరి బీజేపీని మాత్రం మత పిచ్చి అంటూ వ్యాఖ్యలు చెయ్యడం సరైనదేనా? హిందూ దేవీదేవతల్ని కించపరచిన మునావర్ షోకి హైదరాబాదులో అనుమతి ఇవ్వడం ఏ రకంగా కరెక్టో చెప్పాలని డిమాండ్‌ చేశారు రాములమ్మ.

పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానని హిందువుల్ని హెచ్చరించిన టీఆరెస్ సయామీ కవల పార్టీ ఎంఐఎం నేతపై కోర్టు కేసు విషయంలో ఎందుకని అప్పీలుకి వెళ్లలేదో కేసీఆర్ జవాబివ్వాలి. ఇదొక్కటే కాదు ఎంఐఎం నేతలు హిందూ దేవుళ్లను దూషించిన వీడియోలన్నీ ఇప్పటికీ యూట్యూబ్‌లోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నయి. వీటిపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నట్టుగా… కేసీఆర్, తనలోని మతపిచ్చిని ఇతరులకి అంటగడుతూ పబ్బం గడుపుకోవడమేగాక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నడు. ఈ సర్కారు నాటకాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నరు. బుద్ధి చెప్పడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని హెచ్చరించారు విజయ శాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news